కావలసిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ: 1cup
పంచదార: 1cup
నీరు: 2cup
పాలు: 1cup
యాలకులు పొడి: 1tsp
జీడిపప్పు: 10
మైదా: 100grms
నెయ్యి: 100grms
ఆయిల్: 2tbsp
తయారు చేయు విధానము:
1. మైదాను తగినంత నీటితో ఓలిగలకు(బొబ్బట్లు) కలిపినట్లుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రవ్వను కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో నీటిని, పాలను వేసి అవి మరిగాక వేయించి ఉంచిన రవ్వను వేసి కలుపుతూ ఉడికించాలి.
4. మిశ్రమం గట్టి పడిన తర్వాత ఏలకుల పొడి, పంచదార, వేసి కలుపుతూ ఉడికించి చివరగా జీడిపప్పు వేసి దించాలి.(ఫుడ్ కలర్ వేయకుండా కేసరి చేసినట్లుగా చేయాలి)
5. మైదాను చిన్న చిన్న పూరీలు గా చేసి అందులో కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పెట్టి ఓలిగలు(బొబ్బట్లు) వత్తినట్టే చేత్తో వత్తి పెనం మీద నూనె వేస్తూ దోరగా కాల్చాలి. అంతే రవ్వ భక్ష్యాలు రెడీ.
deenine sojji appalu ani kuda antaru kondaru…
yes yes correct