ప్రపంచవ్యాప్తంగా దూసుకువెళ్తున్న ట్విట్టర్ లో మన తెలుగు స్టార్స్ కూడా జాయిన్ అయి సందేశాలు పంపుతున్నారు. తాజాగా నాగార్జున (ఐ యామ్ నాగార్జున), మహేష్ బాబు (యువర్స్ ట్రూలీ మహేష్),సిద్దార్ధ(ఏక్టర్ సిద్దార్ధ) ఈ ట్విట్టర్ ని ఉపయోగించుకుంటూ మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రైయిట్ గా వారినుంచే ఇక మనకి వారి న్యూస్ లు తెలుస్తాయి. మహేష్ బాబు రీసెంట్ గా తన లేటెస్ట్ చిత్రం ఆగస్టు 2010లో రిలీజ్ కానుందని ట్వీట్ చేసారు.
ఇక త్రివిక్రమ్,మహేష్ ల కాంబినేషలో రెడీ అవుతున్న కలేజా(వర్కింగ్ టైటిల్) చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది.అలాగే నాగార్జున హీరోగా దర్శకుడు రాధామోహన్ డైరక్షన్ లో గగనం చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సిద్దార్ధ..బావ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నారు.