‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో అమీర్ ఖాన్?

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ హీరో అమీర్‌ఖాన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కరోడ్‌పతి నాలుగో సిరీస్‌కు అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా ఉండబోతున్నాడని ప్రసార మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. కౌన్‌ బనేగా కరోడ్‌పతి మొదటి, రెండు సిరీస్‌లకు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, మూడో సిరీస్‌కు షారూఖ్‌ఖాన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. షారూఖ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం త్వరలో ముగియనుంది.

అమితాబ్ హయాంలో విస్తృత ప్రచారం పొందిన ఈ కార్యక్రమం షారూఖ్ హయాంలో కూడా బాగా సాగింది. తాజాగా అమీర్ ఖాన్ రావడంతో కొత్తదనం రాబోతోందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Leave a comment